by సూర్య | Sun, Jan 17, 2021, 02:19 PM
తనకు చెడ్డపేరు వస్తున్నా, నమ్ముకున్న పార్టీ రుణం తీర్చుకునేందుకు డీజీపీ అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఐడీ, సిట్ విచారణలతో సంబంధం లేకుండా సజ్జల పంపిన నివేదికపై మీడియా ముందుకు ఎలా వస్తారని ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడింది తానేనని చెప్పిన బ్రదర్ అనీల్ బృందంతో కలిసి పనిచేసిన ప్రవీణ్ చక్రవర్తిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకంటే, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిదే నేరమా అని నిలదీశారు. ఎవరిని రక్షించటం కోసం ఈ తొందరపాటు అని ఎద్దేవా చేసారు. జగన్ని సంతృప్తిపరచటానికి డీజీపీ గీత దాటి వెళ్తున్నారేమో ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.
Latest News