by సూర్య | Sun, Jan 17, 2021, 12:51 PM
ఏపీ మత సామరస్యానికి ప్రతీక.. మతాల మధ్య ఘర్షణ లేనే లేదు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకొస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించమని.. బూట్లు వేసుకుని పూజలు చేసే నీకు హిందూత్వంపై ప్రేమ ఉందా?అని ఆయన ప్రశ్నించారు. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Latest News