డీజీపీని వెంటనే తొలగించాలి: సోమువీర్రాజు

by సూర్య | Sun, Jan 17, 2021, 11:05 AM

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ, టీడీపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. డీజీపీని వెంటనే తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. డీజీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో డీజీపీకి తెలుసా అని నిలదీశారు. విగ్రహాల ధ్వంసం కేసును ప్రభుత్వం సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిత్లీ తుఫాన్‌లో విగ్రహం ధ్వంసమైందని సోషల్‌మీడియాలో పెడితే కేసు పెట్టారన్నారు. బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో ధ్వంసమైన విగ్రహాలకు సంబంధించి.. ఇప్పుడు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM