by సూర్య | Sat, Jan 16, 2021, 05:24 PM
ఏబీపీ న్యూస్,సీ ఓటర్ సంస్థలు కలిసి అన్ని రాష్ట్రాల సీఎంల పనితీరు,కరోనా క్రైసిస్ ను దేశం ఎలా ఎదుర్కొంది అనే దాని పై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో టాప్ 10 బెస్ట్ సీఎంలలో 3వ స్థానంలో ఏపీ సీఎం జగన్ నిలిచారు. మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్ నిలిచారు.
పనితీరు బాగాలేని సీఎంలలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, రెండో స్ఠానంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఐదో స్థానంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారు.