by సూర్య | Sat, Jan 16, 2021, 04:24 PM
రాష్ట్రంలో ఒక పక్క ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి.. మరో పక్క ముఖ్యమంత్రి గోపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నోరు లేని గోవులపై కూడా రాజకీయం చేయడo విడ్డురమని గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి పై విరుచుకుపడ్డారు. అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ.. గోవులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయటం ముఖ్యమంత్రి స్థాయి అతనికి తగదని, ఒక వైపు హిందూ దేవాలయాల పై దాడులు, మరోవైపు పూజలు, గోపూజలు నిర్వహిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Latest News