ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..

by సూర్య | Sat, Jan 16, 2021, 11:58 AM

ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రిపెయిడ్ కార్డులను ఇవ్వనుంది. ఇందుకోసం నియో అనే ఫిన్‏టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఎస్ఎంఈలకు నియో భారత్ పేరోల్ కార్డులను ఇవ్వనుంది. ఈ కార్డుల ద్వారా ఎంఎస్ఎంఈలు తమ సంస్థలలోని ఉద్యోగులకు చాలా సులభంగా జీతాలు ఇవ్వొచ్చు. ఈ కార్డు అకౌంట్లోకి రూ.లక్ష వరకు పొందొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వలన కొత్త ప్రిపెయిడ్ కార్డుల వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. ఏటీఎం నుంచి కూడా ఈ కార్డులను ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు. పీఓఎస్ మెషీన్లలో నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయవచ్చు.
ఎంఎస్ఎంఈలు నియో సంస్థలో చేరి.. బ్యాంక్ ప్రిపెయిడ్ కార్డు సర్వీసులను పొందవచ్చు. వీటి కోసం వర్కర్లు ఉన్న ప్రాంతానికే వచ్చి ఈ ప్రిపెయిడ్ కార్డులు ఇస్తారు. కేవైసీ కోసం వర్కర్ల నుంచి బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత అకౌంట్ క్రియేట్ చేసి ప్రిపెయిడ్ కార్డులను జారీ చేస్తారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM