జగన్ పాలనలో వైపీఎస్‌లుగా మారిన ఐపీఎస్‌లు: బోండా ఉమా

by సూర్య | Sat, Jan 16, 2021, 09:04 AM

అమరావతి: డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలైన నిందితుల లిస్ట్ పోలీసుల దగ్గర ఉన్నా వైసీపీ వత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హిందూ దేవాలయలలో కూడా మతమార్పిడులు చేస్తుండటం దారుణం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలో విచ్చలవిడిగా మతమార్పిడులు పెరిగాయి వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎప్పుడూ లేని విధంగా జగన్ పాలనలో కొందరు ఐపీఎస్‌లు వైపీఎస్‌లుగా మారారన్నారు. సలహాదారుల ఆదేశాలను తుచతప్పక పాటిస్తున్నారని విమర్శించారు. అనేక సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా, రాష్ట్రంలో లా & ఆర్డర్ ఎక్కడా లేకపోయిన పట్టించుకోని ఐపీఎస్‌లు సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యలను పెడితే అరెస్టులు మాత్రం చేస్తున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM