by సూర్య | Fri, Jan 15, 2021, 05:43 PM
కడప జిల్లా గండికోటలో గురువారం రాత్రి నంద్యాలకు చెందిన యువకుడు కిడ్నాప్ అయ్యాడు. గురువారం గండికోట సందర్శన నిమిత్తం హైదరాబాద్, నంద్యాలకు చెందిన కొంతమంది వచ్చి...గుడారాలు వేసుకొని బసచేశారు. మద్యం మత్తులో హైదరాబాద్, నంద్యాల వాసుల మధ్య వివాదం చెలరేగి...నంద్యాల యువకుడి కిడ్నాప్ జరిగింది.అపహరణపై నంద్యాల వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిని తీసుకెళ్తున్న వాహనాన్ని జమ్మలమడుగు వద్ద పోలీసులు అడ్డుకుని...ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
Latest News