by సూర్య | Wed, Jan 13, 2021, 11:50 AM
రాష్ట్రానికి మరో 2.70 లక్షల కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాలకు టీకాలను తరలించారు. 19 వాహనాల్లో విశాఖ, గుంటూరు, కడప, కర్నూలుకు వ్యాక్సిన్ తరలించారు. వ్యాక్సిన్ తరలింపు ఏర్పాట్లను జేడీ శ్రీవారి, రాష్ట్ర వ్యాధి నిరోధక టీకా కేంద్ర అధికారి దేవానందం పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కేంద్రం తొలివిడతలో రాష్ట్రానికి 4,96,680 డోసులు అందించింది.
Latest News