by సూర్య | Wed, Jan 13, 2021, 09:49 AM
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రహస్యంగా బరులు సిద్ధమయ్యాయి. ఏ క్షణమైనా అనుమతులు రావచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసు అధికారులతో పందాల నిర్వాహకులు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి కోసం ఉన్నత స్థాయి అధికారులతో వైసీపీ నేతలు మంతనాలు చేపట్టారు.
Latest News