హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో జగన్ భేటీ..

by సూర్య | Tue, Jan 12, 2021, 03:38 PM

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు, విజయవాడ పర్యటన నిమిత్తం వచ్చిన దత్తాత్రేయ ఈ ఉదయం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్ధ ప్రసాదాలు అందించారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడం ద్వారా త్వరలోనే మహమ్మారిపై విజయం సాధించబోతున్నామని బండారు దత్తాత్రేయ అన్నారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM