by సూర్య | Tue, Jan 12, 2021, 02:33 PM
సీరం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏపీకి చేరుకుంది. పుణె నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వ్యాక్సిన్ చేరుకుంది. జనవరి 16 నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గన్నవరంలోని టీకాల కేంద్రంలో వ్యాక్సిన్ ను నిల్వ చేయనున్నారు. రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రంగా గన్నవరం టీకాల కేంద్రం ఉండనుంది. ఏపీలో తొలివిడతగా 4,96,680 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయనున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లోని వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్ ను తరలించనున్నారు.
Latest News