by సూర్య | Mon, Jan 11, 2021, 04:41 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రుల కమిటీతోపాటు టీచర్లు, అధికారులు, వాలంటీర్లపైనా ఉందని సీఎం జగన్ తెలిపారు. పిల్లలను బడికి పంపే బాధ్యతను వాలంటీర్లకు సీఎం అప్పగించారు. విద్యార్థి ఒకరోజు బడికి రాకపోయినా తల్లిదండ్రుల ఫోన్ కి మెసేజ్ వెళ్తుందని..వరుసగా రెండు రోజులు రాకపోతే వాలంటీర్ నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటారని చెప్పారు. వాలంటీర్ వారి వివరాలను ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల కమిటీకి తెలియజేస్తారని జగన్ తెలిపారు.
Latest News