రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన..

by సూర్య | Sun, Jan 10, 2021, 10:20 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం నెల్లూరులో పర్యటించనున్నారు. అక్కడ రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు పయణం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.

Latest News

 
ఉత్తరాఖండ్‌- నేపాల్‌ సరిహద్దుల మూసివేత Tue, Apr 16, 2024, 02:04 PM
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM
సునీత చెప్పేవన్నీ అబద్దాలే Tue, Apr 16, 2024, 01:25 PM