by సూర్య | Fri, Jan 08, 2021, 05:28 PM
ప్రముఖ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. రైతులు, ఇతర వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంను జిల్లాగా ప్రకటించాలన్నారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం జగన్ ను కలిసి మాట్లాడతానన్నారు. బాలకృష్ణ ఈ విషయంలో ఇంతకుముందు సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు.
హిందూపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ ఆరోపించారు. ఇప్పటికే హిందూపురంకు ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు మారారని, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.