సీఎం జగన్ ను కలుస్తా: బాలకృష్ణ

by సూర్య | Fri, Jan 08, 2021, 05:28 PM

ప్రముఖ నటుడు, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. రైతులు, ఇతర వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంను జిల్లాగా ప్రకటించాలన్నారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం జగన్ ను కలిసి మాట్లాడతానన్నారు. బాలకృష్ణ ఈ విషయంలో ఇంతకుముందు సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు.
హిందూపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ ఆరోపించారు. ఇప్పటికే హిందూపురంకు ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు మారారని, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM