రమణ దీక్షితులు ఆసక్తికర ట్వీట్

by సూర్య | Fri, Jan 08, 2021, 11:09 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఓ విన్నపం చేశారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ళ మండపం మళ్లీ నిర్మించాలని దీక్షితులు కోరారు. ఈ మేరకు సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యికాళ్ళ మండపాన్ని పునర్‌నిర్మిస్తే శ్రీవారి భక్తులు సంతోషిస్తారన్నారు. దేవాలయాలు తిరిగి నిర్మాణం చేపట్టిన శుభసమయంలో సీఎం జగన్‌కు శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రమణదీక్షితులు ట్వీట్ చేశారు.


రమణ దీక్షితులు వెయ్యికాళ్ల మండపాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆ మండపాన్ని తిరిగి నిర్మించాలని ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్‌కు విన్నవించడం ఆసక్తికరంగా మారింది. ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM