by సూర్య | Thu, Jan 07, 2021, 12:07 PM
తనకు జన్మనిచ్చిన తల్లి చనిపోతే ఆమెకు కనీసం తలకొరివి పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు ఓ సుపుత్రుడు. తలకొరివి పెట్టాల్సి వస్తుందని ముఖం చాటేశాడు. కృష్ణా జిల్లాలో ఈ దారుణం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బంటుమిల్లిలో రాజారత్నం అనే మహిళ చనిపోయింది. ఆమె తన కుమార్తె ఇంట్లో ఉంటూ కన్నుమూసింది. దీంతో మృతదేహాన్ని మచిలీపట్నం జిల్లా కోర్టు సమీపంలో ఉండే కుమారుడు ఇంటికి తీసుకుని వచ్చారు కూతురు, అల్లుడు. అయితే, ఆమెకు అంత్యక్రియలు చేయబోనంటూ కుమారుడు నాగ ప్రసాద్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. తాను తలకొరివి పెట్టబోనంటూ అక్కడి నుంచి ముఖం చాటేశాడు. నాగ ప్రసాద్ ఏదో సాధారణ వ్యక్తి కాదు. చదువుకున్నవాడే. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తమ అక్క, బావ డబ్బులు కోసం తన తల్లిని చంపారంటూ చిలకపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నాగ వర ప్రసాద్. తలకొరువు పెట్టాల్సిన కొడుకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వెళ్లి పోవడంతో స్థానికులు విస్తుపోయారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవడంతో ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు.
Latest News