by సూర్య | Mon, Oct 19, 2020, 02:29 PM
బిసి గర్జన సందర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడ చేయని విధంగా బిసిలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మరో సారి బిసిల ఆత్మ గౌరవాన్ని పెంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి చరిత్ర తిరగ రాచారని రాష్ట్రమంత్రులు కురసాల కన్నబాబు పినిపే విశ్వరూప్ చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి సోమవారం మంత్రులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు బీసీలకు మద్దతుగా రాష్ట్ర మంత్రులు పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది ఏలూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో బిసి గర్జనలో పాల్గొని అన్ని కులాలకు కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మేరకు నేడు 56కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మాట తప్పం మడమ తిప్పం అని జగన్ మరోసారి నిరూపించుకున్నారన్నారు.
Latest News