తెలుగుదేశం కమిటీలను ప్రకటించిన చంద్రబాబు

by సూర్య | Mon, Oct 19, 2020, 01:14 PM

తెలుగుదేశం కమిటీలను ఆ పార్టీ  అదినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్ ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు.


ఇదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి చంద్రబాబు అవకాశం కల్పించారు. వీరిలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు తెలంగాణ నుంచి నండూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, నజీర్, ప్రేమ్ కుమార్, దీపక్ రెడ్డిలు ఉన్నారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM