by సూర్య | Fri, Oct 16, 2020, 05:46 PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఐరన్ లెగ్ అని, దరిద్ర పాదమని మండిపడ్డారు. వైసీపీ 17 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు ఒక్క రోజైనా ప్రశాంతగా ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుందని దుయ్యబట్టారు.
భారీ వరదలతో ప్రజాలు అవస్థలు పడుతుంటే... జగన్ వల్లే వర్షాలు పడుతున్నాయిని చెప్పడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సిగ్గుండాలని అన్నారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Latest News