మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటన

by సూర్య | Fri, Oct 16, 2020, 02:49 PM

భారీ వర్షాల ధాటికి పంటలు పాడైపోయిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు పర్యటిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, గుండిమెడలో దెబ్బతిన్న పసుపు, మినుము పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంట పొలాల రైతులకు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ రైతులకు భరోసా ఇచ్చారని టీడీపీ ప్రకటించింది. ఆయనతో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఈ విషయంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మంగళగిరి నియోజకవర్గంలోని గుండిమెడ, చిర్రావూరు, పెదకొండూరు గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించాను’ అని ఆయన చెబుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM