by సూర్య | Fri, Oct 16, 2020, 01:16 PM
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం దగ్గర తంగేడుమల్లి మేజర్ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారుగా గుర్తించారు. బాధితులు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వెళ్తుండగా అద్దంకి-నార్కట్పల్లి హైవేపై అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News