గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

by సూర్య | Fri, Oct 16, 2020, 01:16 PM

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం దగ్గర తంగేడుమల్లి మేజర్‌ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన లో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారుగా గుర్తించారు. బాధితులు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా వెళ్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి హైవే‌పై అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM