by సూర్య | Fri, Oct 16, 2020, 11:30 AM
కడప జిల్లా రాపూరు చిట్వేల్ అడవిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి బాలబాబు, అంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన నెత్తి పూజారి గంగాదేవి ల కుమార్తె అంజలి అనే అమ్మాయి ఐదు రోజుల క్రితం కనబడకుండా పోయింది. ఆమె అదృశ్యం కావడంతో పెనగలూరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన మొలకల నారాయణ కుమారుడు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తేలింది. అయితే బాలబాబుకు వేరే యువతితో పెళ్లి నిశ్చయం చేయడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రేమ జంట ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Latest News