జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది : తెలుగు మహిళా నేత వేగుంట రాణి

by సూర్య | Wed, Oct 14, 2020, 02:04 PM

గుంటూరు జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా నేత వేగుంట రాణి పరామర్శించారు. అనంతరం నేత మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోనూ అత్యచారాలు ఆగడం లేదని అన్నారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వేగుంట రాణీ స్పష్టం చేశారు.


గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడులో వివాహితపై అత్యాచారం జరిగింది. కిరాణా షాపుకు వచ్చిన మహిళను శాంతిరాజు అనే వ్యక్తి నిర్బంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రంతా కనిపించకపోవడంతో మహిళ కోసం బంధువులు గాలించారు. చివరకు శాంతి రాజు ఇంట్లో  నిర్బంధంలో ఉన్న మహిళను బంధువులు గుర్తించి జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM