ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు

by సూర్య | Tue, Oct 13, 2020, 04:20 PM

ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి దసరా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయించింది.


ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే, భక్తులను అనుమతించాలని తొలుత నిర్ణయించినా, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. భక్తుల నడుమ స్వామివారి దసరా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేసినా, భక్తుల ఆరోగ్యరీత్యా ఏకాంతంగానే ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM