by సూర్య | Tue, Oct 13, 2020, 02:24 PM
శతాధిక వసంతాల చరిత్ర ఉన్న విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కళాశాల)ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించారు. ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదట ఎంఆర్ కాలేజి వద్ద ధర్నా నిర్వహించారు. ఆపై ర్యాలీగా మంత్రి బొత్స నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నేతలతో పాటు, జిల్లా నేతలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఆర్ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Latest News