by సూర్య | Tue, Oct 13, 2020, 02:10 PM
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడులో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిమేర ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు పగులగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News