by సూర్య | Tue, Oct 13, 2020, 01:22 PM
హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున ఈ కేసుల్లో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ఇన్ చార్జీ న్యాయమూర్తి వివరించారు. నిన్న కూడా ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, జగన్ పై హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలన్న జగన్ న్యాయవాదుల వినతిపై న్యాయస్థానం నిర్ణయం ఇంకా వెలువడలేదు.
Latest News