వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ : జగన్

by సూర్య | Mon, Oct 12, 2020, 06:00 PM

ఏపీ సీఎం జగన్ విద్యుత్ శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు. మోటార్లకు మీటర్లు బిగించే క్రమంలో రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.


ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఇకపై విద్యుత్ బిల్లులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. రైతులు అదే నగదును విద్యుత్ బిల్లుల కింద డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలుందని అన్నారు. మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM