నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా : రఘురామకృష్ణ

by సూర్య | Mon, Oct 12, 2020, 03:57 PM

ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తన ప్రత్యర్థులపైనా, తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా తన పాత ఫొటో ప్రచారం చేస్తున్నారని, అదెప్పుడో మూడేళ్ల నాటి ఫొటో అని వివరించారు. అందులో ఓ రష్యన్ యువతి షాంపేన్ పోస్తుండగా, రఘురామకృష్ణరాజు తాగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించారు.


"ఈ ఫొటో కోల్ కతాలో కానీ, హైదరాబాద్ లో కానీ తీసినది అయ్యుంటుంది. ఓ తెలుగు ఎంపీ ఫంక్షన్ లోది అనుకుంటా. ఈ ఫొటోను నేను కూడా ఎప్పుడూ చూసుకోలేదు. బహుశా ఈ ఫొటోను పెద్దలు సుబ్బారెడ్డి గారు అందించారనుకుంటున్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


ఈ ఫొటోలో చూస్తున్నట్టుగా నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. నేను తాగింది కూడా షాంపేనే. అది పెద్దగా మద్యం కేటగిరీలోకి కూడా రాదు.


ఇక, ఈరోజుల్లో ఫంక్షన్లంటే రష్యన్ యువతులు కామన్ అయిపోయారు. ఆ యువతులు అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ షాంపేన్ పోశారు. ఆ సందర్భంగా నేను ఎవరినీ తాకలేదు... ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. అయినా, నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా ... ఏముందిరా ఆ ఫొటోలో?" అంటూ ఆవేశంగా అన్నారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM