విశాఖ భూ దోపిడీ వెనకున్న వారి ఆటలు కట్టిస్తాం: బొత్స

by సూర్య | Mon, Oct 12, 2020, 03:49 PM

విశాఖపట్టణంలో జరిగిన భూ దోపిడీని వెలికి తీస్తామని, ఇందుకోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖ భూముల సిట్ విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో చర్చించినట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ దోపిడీ జరిగిందని, దీని వెనకున్నవారి ఆటలు కట్టిస్తామని హెచ్చరించారు. అమరావతి ఉద్యమంపై మంత్రి మాట్లాడుతూ.. అమరావతికి మద్దతుగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు ఎవరూ స్పందించలేదని, మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేంటని ప్రశ్నించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM