by సూర్య | Sat, Oct 10, 2020, 04:36 PM
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో తిరుపతికి రప్పించిన ఓ యువతిని బలవంతంగా మద్యం తాగించి వ్యభిచారకూపంలోకి దించాలని చూసిందో ఒకముఠా. ఆ దుర్మార్గుల బారి నుంచి తప్పించుకున్న ఆ యువతి గాయాలతో రుయా ఆస్పత్రిలో చేరింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో యువతి ఖమ్మం నుంచి తిరుపతి వెళ్లేందుకు అంగీకరించింది.
కారును బుక్ చేసి అందులో వస్తుండగా కరకంబాడి వద్ద మరో ఇద్దరు మహిళలు ఆ కారులో ఎక్కారు. ఆయువతిని వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో ససేమిరా అంది. దీంతో ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించి వ్యభిచార కూపంలోకి దించాలని చూశారు. అక్కడి నుంచి తప్పించుకొని యువతి రుయా ఆసుపత్రికి చేరింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News