by సూర్య | Sat, Oct 10, 2020, 02:26 PM
తిరుమల – టిటిడి కొత్త ఈవోగా జవహార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.. శ్రీవారి క్షేత్రంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవోగా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ చరిత్రలో ఆయన 26వ ఈవో. బాధ్యతలు అందుకునే క్రమంలో జవహర్ రెడ్డి ఈ ఉదయం కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. ప్రమాణస్వీకారం అనంతరం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ అధికారులతో సమీక్ష చేపట్టారు. జవహర్ రెడ్డి ఇప్పటివరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జవహర్ రెడ్డి టీటీడీ ఈవో పదవిలోకి రాగా, టిటిడి ఈవో గా పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్లారు.
Latest News