టిటిడి ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌వ‌హార్ రెడ్డి..

by సూర్య | Sat, Oct 10, 2020, 02:26 PM

తిరుమ‌ల – టిటిడి కొత్త ఈవోగా జ‌వ‌హార్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు.. శ్రీవారి క్షేత్రంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవోగా ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ చరిత్రలో ఆయన 26వ ఈవో. బాధ్యతలు అందుకునే క్రమంలో జవహర్ రెడ్డి ఈ ఉదయం కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆల‌యానికి చేరుకున్న‌ ఆయనకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. ప్రమాణస్వీకారం అనంత‌రం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ అధికారులతో సమీక్ష చేపట్టారు. జవహర్ రెడ్డి ఇప్పటివరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జవహర్ రెడ్డి టీటీడీ ఈవో పదవిలోకి రాగా, టిటిడి ఈవో గా పని చేసిన‌ అనిల్ కుమార్ సింఘాల్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్లారు.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM