by సూర్య | Fri, Oct 09, 2020, 10:14 AM
టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 10 ఏళ్ల రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. కేసుల గురించి సీఎం జగన్ భయపడరని, కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవన్నారు. సీఎం జగన్పై ఉన్నవన్ని కుట్రపూరితమైన కేసులేనన్నారు. ప్రజలు 151 సీట్లతో సీఎం జగన్ను అఖండ మెజార్టీతో గెలిపించి, చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
Latest News