by సూర్య | Fri, Oct 09, 2020, 09:19 AM
రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. విశాఖవాతావరణ కేంద్రం సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. అల్ప పీడనం రాగల 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
Latest News