by సూర్య | Thu, Oct 08, 2020, 03:53 PM
పెళ్లి చేయడం లేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగిందని టీఓఐ కథనం పేర్కొంది. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురానికి చెందిన భీమవరపు నవీన్(24) నిత్యం తాగొచ్చి పెళ్లి చేయమంటూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. పెళ్లి చేయకపోతే చనిపోతానంటూ బెదిరింపులకు దిగేవాడు. అయినా కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోకి వెళ్లడంతో రోజు మాదిరిగానే మారోమారు బెదిరిస్తున్నాడని అనుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన నవీన్ చున్నీతో ఫ్యాన్ హుక్కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News