నిరుద్యోగులకు శుభవార్త..ఆ విభాగంలో 93 వేల ఖాళీలు!

by సూర్య | Thu, Oct 08, 2020, 03:24 PM

నిరుద్యోగులకు శుభవార్త. వచ్చే ఏడాది ఆగస్టు చివరి నాటికి దేశంలో అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగంలో 93,500 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని ఓ అధ్యయనం ప్రకటించింది. వీటిని భర్తీ చేస్తే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు రానున్నాయి. డేటా అనలైటిక్స్ రంగంలో ఖాళీల సంఖ్య స్వల్పంగా తగ్గుతోంది. కాకపోతే డిమాండ్ మాత్రం స్థిరంగా ఉంటోంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే బెంగళూరులో అనలిటిక్స్ విభాగంలో అత్యధిక ఉద్యోగాలు ఉన్నాయి. దేశం మొత్తంతో పోల్చితే.. ఈ ఒక్క నగరంలో 23 శాతం ఉద్యోగాలు ఆ రంగానికి సంబంధించినవి ఉన్నాయి. ఢిల్లీలో 20 శాతం కాగా, ముంబాయి మరో 15 శాతం ఉద్యోగాలను ఈ రంగంలో అందిస్తోంది. హైదరాబాద్, పూణే, చెన్నై వంటి ఇతర ప్రసిద్ధ మెట్రో నగరాలు గత సంవత్సరంతో పోలిస్తే ఆగస్టులో ఉద్యోగాల నిష్పత్తిలో స్వల్ప వృద్ధిని సాధించాయి. దేశంలో కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ, ఆగస్టులో ప్రపంచంలోని అనలిటిక్స్ జాబ్ ఓపెనింగ్స్‌లో భారత్ 9.8 శాతం పాలు పంచుకుంది. ఇది 2020 జనవరిలో 7.2 శాతంగా ఉంది.


ఇండియాకు చెందిన అనలైటిక్స్ స్ట్రాటప్ కంపెనీలకు నిధులు పెరగడం ఈ ఉద్యోగాల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ఏడేళ్ల అనుభవం ఉన్న వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ ఉద్యోగాల శాతం జనవరి నుంచి ఇప్పటి వరకు 8.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. ఫార్మా రంగం అనలిటిక్స్ ఉద్యోగాల నిష్పత్తిలో 16.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం 3.9 శాతం పెరిగింది. కోవిడ్ -19 వైరస్ కోసం టీకాలు, ఇతర మందులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం దీనికి కారణం ”అని నివేదిక పేర్కొంది. ఆక్సెంచర్, ఎంఫసిస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబీఎం ఇండియా, డెల్, హెచ్ సీఎల్ తదితర ప్రముఖ కంపెనీల్లో డేటా సైన్స్ విభాగంలో అత్యధిక ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో డేటా సైన్స్ నిపుణుల సగటు జీతం 2020 లో సంవత్సరానికి రూ .9.5 లక్షలు అని అధ్యయనం వెల్లడించింది. పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. వారి నైపుణ్యం, వారి రోల్ ఆధారంగా ఏడాదికి రూ .25 లక్షల నుంచి రూ .50 లక్షల ప్యాకేజీలను ఆయా కంపెనీలు అందించే అవకాశం ఉంది.

Latest News

 
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు Fri, Apr 19, 2024, 11:54 AM
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ Fri, Apr 19, 2024, 11:39 AM
శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయానికి రూ. 58వేలు విరాళం Fri, Apr 19, 2024, 11:39 AM
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM