మరో వైసిపి ఎంపీకి కరోనా...

by సూర్య | Thu, Oct 08, 2020, 01:35 PM

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా చేరారు. కోటగిరి శ్రీధర్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆయన కార్యాలయంలో మరో నలుగురు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, గత వారం రోజులుగా తనను కలిసిన వాళ్లు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోటగిరి శ్రీధర్ సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.


ఎవరికీ మినహాయింపు ఇవ్వని కరోనా వైరస్ ప్రజాప్రతినిధులు, నేతలపై తన ప్రభావం చూపుతోంది. ఏపీలో మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి రాజకీయప్రముఖులు సైతం ఈ మహమ్మారికి బలవడం విషాదకరం.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM