by సూర్య | Thu, Oct 08, 2020, 12:45 PM
తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణ పరిధిలోని మెహర్ కాంప్లెక్స్ నుంచి పశువుల ఆసుపత్రి వెళ్లే రోడ్డులో బుధవారం సాయంత్రం మోటర్ సైకిల్ పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో సంజయ్ అనే 20 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న రామ్ అనే యువకుడికి ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. గాయపడిన యువకుడిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేసున్నారు.
Latest News