by సూర్య | Thu, Oct 08, 2020, 12:26 PM
ఏపీ సర్కార్ నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్నర్సులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు.
పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్వో కార్యాలయంలో ఇవ్వాలి. నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పోస్టులకు అక్టోబర్ 12, పశ్చిమ గోదావరి జిల్లా పోస్టులకు 14, మిగిలిన జిల్లాల్లో ఈనెల 10 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు hmfw.ap.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం - 229, విజయనగరం - 217, విశాఖపట్నం - 322, తూర్పు గోదావరి - 326, పశ్చిమ గోదావరి - 159, కృష్ణా - 171, గుంటూరు - 160, ప్రకాశం - 194, నెల్లూరు - 76, చిత్తూరు- 194, కడప- 296, కర్నూలు - 322, అనంతపురం - 176 ఖాళీలున్నాయి.