టీనేజ్ యువతి కిడ్నాప్, అత్యాచారం..

by సూర్య | Wed, Oct 07, 2020, 12:52 PM

టీనేజ్ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. టీనేజ్ యువతి(17)ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి గత నెల 21న కిడ్నాప్‌కి గురైంది. ఆమెను తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.


పదిహేను రోజుల అనంతరం గ్రామానికి చేరుకున్న యువతి ఈ మేరకు సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారం, ఆమె మైనర్ కావడంతో పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిడదవోలు సీఐ విచారణ జరుపుతున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM