ఇటలీలో పరిస్థితి బీభత్సం... 10 వేలు దాటిన కరోనా మరణాలు

by సూర్య | Sun, Mar 29, 2020, 04:37 PM

ప్రపంచ దేశాలన్నీ కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరోప్ లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటలీపై కరోనా ఇంకా పంజా విసురుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6,64,695 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 30,847గా ఉంది. 1,46,156 మందికి కరోనా నయమైంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలోనే సంభవించాయి. అక్కడ 92,472 పాజిటివ్ కేసులు ఉండగా, 10,023 మంది మరణించారు. స్పెయిన్ లో 73,235 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 5,982 మంది మృత్యువాత పడ్డారు. ఆసియా అగ్రదేశం చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య 81,439, మరణాల సంఖ్య3,300గా ఉంది. ఇరాన్ లో 35,408 పాజిటివ్ కేసులు నమోదవగా, 2,517 మందిని మృత్యువు కబళించింది. ఫ్రాన్స్ లోనూ పరిస్థితి భీతావహంగానే ఉంది. ఇప్పుడక్కడ 2,314 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు వదిలినట్టు గుర్తించారు. అక్కడ పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 37,575కి పెరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షదాటింది. మరణాల సంఖ్య గత మూడురోజుల్లో రెట్టింపైంది. అమెరికాలో 1,23,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,211 అని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సగానికి పైగా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

Latest News

 
అనంతపురం జిల్లా టీడీపీ అభ్యర్థులకు నేడు బీ.ఫామ్స్ అందించిన చంద్రబాబు Tue, Apr 23, 2024, 08:09 PM
సీఎం జగన్ పై కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు Tue, Apr 23, 2024, 08:08 PM
జగన్ రాష్ట్రానికి చేసిందేమిలేదు Tue, Apr 23, 2024, 08:08 PM
వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తా Tue, Apr 23, 2024, 08:07 PM
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? Tue, Apr 23, 2024, 08:07 PM