by సూర్య | Sun, Mar 29, 2020, 02:01 PM
కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు. అయితే బ్యాంకులు మాత్రం యథావిధిగా తమ సేవలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, బ్యాంక్ అఫ్ బరోడా యాజమాన్యాలు తమ సిబ్బందికి అదనపు వేతనాన్ని ప్రకటించాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 14వ తేదీ మధ్య కాలంలో విధులు నిర్వహించిన వారికి అదనంగా రెండువేల రూపాయలు ఇవ్వనున్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకు అన్ని శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఈ మొత్తం అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం కూడా తమ సిబ్బంది మాస్క్లు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుగోలు కోసం 2వేలు అందజేయనున్నట్లు తెలిపింది.
Latest News