by సూర్య | Sun, Mar 29, 2020, 01:11 PM
కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. తాజాగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సైతం భారీగా విరాళం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.51 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపింది. కరోనాపై పోరాటానిక అందరం చేయి చేయి కలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
Latest News