by సూర్య | Sun, Mar 29, 2020, 11:51 AM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని నివారించేందుకు కేంద్రం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించేలా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ ను ఉద్యోగులు తిరిగి తీసుకునేందుకు ఆర్థిక శాఖ అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం ఉద్యోగి మూడు నెలల మూలవేతనం, డీఏ తీసుకోవచ్చు లేదా కనీస నిల్వ నుంచి 75 శాతం వరకు తీసుకోవచ్చు. ఈ రెండు మొత్తాల్లో ఏది తక్కువైతే ఆ మొత్తం తీసుకోవచ్చు. ఈపీఎఫ్ డబ్బు కావాలనుకున్నవారు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాన్ని పరిశీలించి... డబ్బు తీసుకునే అవకాశం కల్పిస్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News