by సూర్య | Sun, Mar 29, 2020, 11:48 AM
ఇండియాలో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- నిన్న సాయంత్రానికి 870కా పైగా కేసులు
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం 920 యాక్టివ్ కేసులు
- రికవరీ అయింది 85 మంది మాత్రమే
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న సాయంత్రానికి 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు. 24 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఇక రికవరీల విషయంలోను మహారాష్ట్ర ముందు ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 25 మంది వ్యాధిగ్రస్తులు రికవరీ అయ్యారు.