by సూర్య | Sat, Mar 28, 2020, 05:54 PM
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలా మంది ఏసీలు వాడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమికట్టే ప్రయత్నంలో అందరూ లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఎయిర్ కండిషనర్లు అనేవి ఇళ్లలో కరోనావైరస్ వ్యాప్తిని పెంచుతాయని చాలా మందికి సందేహం ఉంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హోమ్ ఎసి యూనిట్లు కోవిడ్ -19 ను వ్యాప్తి చేయవు. ఏదేమైనా, కరోనావైరస్ అనేది చల్లటి ప్రదేశాలలో వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, కొన్ని అపార్టుమెంట్లలో లేదా ఏసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కరోనా సోకిన వ్యక్తి వెళ్లి ఉంటే ఆ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది.
ఈ వైరస్ సాధారణ జలుబు మరియు ఫ్లూ కారణమయ్యే వైరస్ల మాదిరిగానే గాలిలో ఉండదు. ఒక వ్యక్తి తుమ్మినట్లయితే తుంపర్లు గాలిలో వెదజల్లబడతాయి. ఆ సమయంలో వైరస్ గాలిలో ఉన్నప్పుడు అది అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ కరోనా వైరస్ అనేది గాలిలో తేలుతూ ఉండదు. అది ఉపరితలాలపై చేరుతుంది.
మనం ఏసీలు వాడుతున్నప్పుడు కిటికీలు, తలుపులు అనేవి మూసివేస్తాం. అంటే ఆ సమయంలో గదిలో ఉన్నటువంటి గాలి అనేది ఏసీలో రిసైక్లింగ్ చేయబడుతుంది. ఆ గాలి బయటకు వెళ్లదు కాబట్టి.. అది ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటుంది. ఒక వేళ కరోనా సోకిన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉంటే ఆ గాలి ద్వారా అది అందరికీ వ్యాపించే అవకాశం ఉంది. అంతేకానీ ఏసీలు వాడిన ప్రతి ఒక్కరికీ వైరస్ సోకే అవకాశం ఉండదు.
Latest News