by సూర్య | Sat, Mar 28, 2020, 05:23 PM
కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపరుస్తుంది. గుంటూరు జిల్లాలోని ఓ వైసీపీ ఎమ్మెల్యేకు డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బంధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. అతడు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేను కలిశాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఎమ్మెల్యేను,ఆయన కుటుంబ సభ్యులను మెడికల్ కాలేజీకి తరలించి కరోన పరీక్షలు నిర్వహించారు. వీరి రిపోర్టులు రెండు రోజుల్లో రానున్నాయి. అప్పటి వరకు ఎమ్మెల్యే,కుటుంబ సభ్యులు ఐసోలేషన్ వార్డులో ఉండనున్నారు.
Latest News