by సూర్య | Sat, Mar 28, 2020, 09:31 AM
కరోనాతో చనిపోయిన వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారితో యావత్ ప్రపంచంలో ఒక్కరోజులో 2791 మంది చనిపోయారు. దీనితో కలిపి ఇప్పటిదాకా ప్రపంచంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 25,410 కు చేరింది. మొత్తం 5, 65,044 కరోనా కేసుల్లో రికవరీ అయినవాళ్లు 1,29,309 మంది. పాజిటివ్ కేసులో అమెరికా ఇప్పటికే చైనాని దాటేసి 92,206 కేసులతో మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం 9:15 గంటలకి తెలిపిన వివరాల ప్రకారం ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసులు 724 గా ఉండగా, కరోనా నుండి కోలుకున్నవాళ్ళ సంఖ్య 67 కి చేరింది. వారిలో చనిపోయినవారు 17 మంది.
Latest News