by సూర్య | Sat, Mar 28, 2020, 09:12 AM
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. విశాఖలో ఒకరికి,గుంటూరులో మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రెండు కేసులు కూడా ప్రైమరీ కాంటాక్ట్ కేసులే. ఈ ఇద్దరు గతంలో కరోనా వచ్చిన పేషంట్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ 13 కేసులలో ఒకరు కోలుకోని డిశ్చార్జి అయ్యాడు. మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్నారు.రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.
Latest News